ఉట్నూర్, ఆగస్టు 9 : తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ముఖ్యమంత్రే విద్యాశాఖను అంటిపెట్టుకున్న సమస్యలు పరిష్కారం కావడంలేదు. విద్యారంగంలో సంస్కరణలు లేకపోగా.. ఉన్న పాఠశాలలు మూత పడుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాలు చేయనున్నట్లు ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించాయి. ఇందులో భాగంగా ఇప్పటికే నాలుగు దశల కార్యాచరణను ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) ప్రకటించింది.
కార్యాచరణ..
డిమాండ్లు..
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి..
చాలా మంది పదోన్నతులు పొందకుండానే పదవి విరమణ చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. పదోన్నతులు పొందకపోతే ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వారివారి కాలానుగుణంగా తీసుకోవాల్సిన చర్యలు, ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తాము గుర్తుచేయాల్సిన బాధ్యత ఉంది. నాణ్యమైన విద్య, బడులలో ఉపాధ్యాయుల సర్దుబాటు పేరిట పాఠశాలల మూసివేతను తాము ఒప్పుకోం. విద్యాహక్కు చట్టం ప్రకారం ఏ ఒక్క విద్యార్థికి విద్య దూరం చేయొద్దనే నిబంధన పాటించాలి. తమ న్యాయమైన డిమాండ్లు ఒప్పుకోకుంటే తమ ప్రణాళిక ప్రకారం ఉద్యమాలు చేస్తాం.
– ముడుగు సామ్యూల్, డీటీఎఫ్ రాష్ట్రకార్యదర్శి, ఉట్నూర్.