బాన్సువాడ రూరల్/ ఎల్లారెడ్డి రూరల్, ఆగస్టు 9 : బాన్సువాడ మండలంలోని పోచారం తండా, రాంపూర్ తండా గ్రామాల్లో గిరిజనులు ఆదివారం తీజ్ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి బాజిరెడ్డి గోవర్ధన్ స్థానిక నాయకులతో కలిసి హాజరయ్యారు.
తండాలో నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో ముత్యాల పోచమ్మతల్లికి బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొన్నారు. బైక్ర్యాలీగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు.