చండ్రుగొండ: తిప్పనపల్లి పంచాయతీ మాజీ సర్పంచ్ గుగులోత్ భగవాన్నాయక్(92)బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన మృతదేహానికి టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి, ఘనంగా నివాళి అర్పించారు. అంతిమయాత్రలో గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
నివాళి అర్పించిన వారిలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు మాలోత్ భోజ్యనాయక్, జడ వెంకయ్య, గానుగపాడు సోసైటి చైర్మన్ చెవుల చందర్రావు, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ గాదె లింగయ్య, ఎంపిటీసీ లంకా విజయలక్ష్మి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, గపార్మియా, కళ్లెం వెంకటేశ్వర్లు, పసుపులేటి రాధక్రిష్ణ, రామారావు, మచ్చ కుమార్, తదితరులు ఉన్నారు.