భద్రాచలం: కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ కార్మిక సంఘం నాయకులు ముందుండాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల కమిటీ అనుబంధ సంఘమైన కార్మిక సంఘం అధ్యక్షుడు చుక్కా సుధాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం కేసీఆర్ అమలు చేశారన్నారు. ఎక్కడ రాజకీయం లేకుండా, వివక్షత లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రంలోనే కొనసాగుతున్నాయని అన్నారు. సమాజంలోని అన్నివర్గాలను కలుపుకొనిపోతూ ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ లక్ష్య సాధన కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మండల కమిటీ, కార్మిక సంఘం నాయకులు గజమాలతో డాక్టర్ వెంకట్రావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు అరికెల్ల తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి, అధికార ప్రతినిథి గల్లా రాంబాబు, సీనియర్ నాయకులు కే ప్రభోథ్కుమార్, రమాకాంత్, చిట్టిబాబు, రాజీవ్, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు కేజే ప్రేమ్కుమార్, ఎస్కే రహీం, ఎం పుల్లారావు, జే శ్రీనివాస్, సాయి, చిన్ని, శ్రీనివాస్,నాని, చంద్రశేఖర్, నాగేంద్ర యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.