టేకులపల్లి : సీడీపీఓ పరిధిలో ఉన్న అంగన్ వాడీ సిబ్బందికి చిరుధాన్యాల వంటకాలపై శిక్షణ కార్యక్రమం జరిగింది. శనివారం టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు రైతు వేదికలో టేకులపల్లి, ఆళ్లపల్లి, గుండాల మండలాలలో అంగన్ వాడీ కేంద్రంలో పని చేస్తున్న సిబ్బందికి ఐదు రోజుల పాటు చిరుధాన్యాల వంటకాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో తార మాట్లాడుతూ సిరిదాన్యాల వంటకాలతోనే పోషకవిలువలు అందుతాయని, ఈ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిల్లుడుతండ సర్పంచ్ అజ్మీర గలక, ఏసీడీపీ అరుణకుమార్, సూపర్వైజర్లు అనురాధ, సక్కుబాయి, సాలమ్మ, సుమలత, రోజా, అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.