భద్రాద్రి కొత్తగూడెం, మే 16 : ఉపాధ్యాయులు పోక్సో చట్టం, సైబర్ నేరాలు పట్ల అప్రమత్తతో ఉండాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. శుక్రవారం జిల్లా విద్యా శిక్షణా కేంద్రం కొత్తగూడెం నందు జరుగుతున్న ఆంగ్ల ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో భాగంగా పోక్సో చట్టం, బాలికల అక్రమ రవాణా, సైబర్ నేరాల గురించి ఉపాధ్యాయులకి వివరించారు. కేవలం నేరం చేయడమే కాకుండా, నేరాన్ని దాచిపెట్టడం కూడా నేరంగా పరిగణించబడుతుందని తెలిపారు.
విద్యార్థులు పాఠశాలకు వచ్చిన దగ్గర నుండి తిరిగి వెళ్లే వరకు కూడా ఉపాధ్యాయులే బాధ్యత వహించాలన్నారు. తెలియని కాల్స్ కు సమాధానం ఇవ్వడం వల్ల మన అకౌంట్ హ్యాక్ అయి అందులో ఉన్న సొమ్ము మొత్తం చోరీకి గురవుతుందని, అందుకే అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే కాల్స్ కానీ వీడియో కాల్స్ కు కానీ సమాధానం ఇవ్వొద్దన్నారు. ఈ కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్, జిల్లా ప్లానింగ్ కో ఆర్డినేటర్ ఎన్.సతీశ్ కుమార్, వన్ టౌన్ సీఐ కరుణాకర్, ఎస్ఐ విజయ, రిసోర్స్ పర్సన్లు సైదులు, మీరా హుస్సేన్, మురళి, హరిబాబు పాల్గొన్నారు.