భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో శ్రావణ బహుళ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రామయ్యకు నిత్యకల్యాణం నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆలయ తలుపులు తెరిచి రామయ్యకు సుప్రభాత సేవ, ఆరాధన,సేవాకాలం, నిత్య బలిహరణం, నిత్య హోమాలు, జరిపారు. రామాలయం గాలిగోపురానికి అభిముఖంగా ఉన్న ఆంజనేయ స్వామివారికి ఉదయం పంచామృతాలతో అభిషేకం, తమలపాకులతో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం శ్రీసీతా, రామ, లక్ష్మణ ఉత్సవమూర్తులను ప్రాకార మండపంలో వేంచేపు చేసి , విశ్వక్సేన ఆరాధన, ఫుణ్యఃవచనం చేశారు. అర్చకుల వేద మంత్రోచ్ఛరణల నడుమ రాములోరి నిత్య కల్యాణం ఘనంగా నిర్వహించారు.