చండ్రుగొండ: అయ్యప్ప భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ సేవలు ప్రారంభించిందని కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వరబాబు అన్నారు. మంగళవారం చండ్రుగొండ బస్స్టేషన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…శబరిమలైకు వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం డీలక్స్, లగ్జరీ, ఎక్స్ప్రెస్ బస్సులను ఏర్పాటు చేయటం జరిగిందని, దీనిని అయ్యప్పభక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
7, 8, 10 రోజుల యాత్ర ఉంటుందని, దీనికి అతి తక్కువ ధరలకు మాత్రమే భక్తులను వివిధ రాష్ట్రాలను కలుపుతూ తీసుకుపోవడం జరుగుతుందన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సైతం అద్దె ప్రాతిపదికన బస్సులను పంపటం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సిఆర్సి ఈ శ్యామెల్, ఎస్డిఐ ఎంసీహెచ్రావు, సిబ్బంది బత్తుల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.