మణుగూరు : బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 9,10,11 తేదీలలో జరిగే సమ్మెలో పాల్గొనాలని సింగరేణి కార్మికులకు ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. టీబీజీకేఎస్ నేత కోటా శ్రీనివాస్ అధ్యక్షతన ఓసీ-2లో జరిగిన ఫిట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు వీ.ప్రభాకర్రావు, ఏఐటీయూసీ రామ్గోపాల్, ఐఎన్టీయూసీ వెలగపల్లి జాన్, సీఐటీయూ లక్ష్మణ్రావు, బీఎంఎస్ వీరమనేని రవీందర్రావు, హెచ్ఎంఎస్ కుమార్, ఇఫ్టూ నాసర్పాషాలు మాట్లాడారు.
కొన్నివేలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ తెలంగాణకు కొంగు బంగారమైన సింగరేణి తల్లిని సంరక్షించుకునేందుకు జెండాలు వేరైనా సింగరేణి రక్షణే ఎజెండాగా ఐక్యంగా పోరాడి కేంద్రం మెడలు వంచాలని పిలుపునిచ్చారు. ఉత్పత్తి ప్రక్రియకు సిద్ధమైన కె.కె06 అండర్గ్రౌండ్, శ్రావణపల్లి ఓసీ, జేవీఆర్ ఓసీ-3, కోయగూడెం బ్లాకులను సింగరేణికే అప్పగించాలన్నారు. శ్రీరాంపూర్, మణుగూరు గనుల్లో జరిగిన ప్రమాద బాధిత కుటుంబాలకు కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఈపీ ఆపరేటర్ రకీబ్ డిస్మిస్ను రద్దు చేయాలన్నారు.
సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు, కారుణ్య నియామకాలలో వారసుల వయో పరిమితి 35నుంచి 40కు పెంచాలని మెడికల్ అన్ఫిట్ అయ్యే వారసత్వ ఉద్యోగాల కౌన్సిలింగ్ పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన 72 గంటల సమ్మెలో ఢిల్లీ రైతు ఉద్యమ స్ఫూర్తితో ప్రతీ కార్మికుడు పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సామా శ్రీనివాసరెడ్డి, వీరభద్రయ్య, కాపా శివాజీ, కృష్ణ, సీహెచ్ అశోక్, బుర్ర వెంకటేశ్వర్లు, ఇతర పార్టీల నాయకులు నాగరాజు, నజీరుద్దీన్బాబా, మల్లేష్, రామనర్సయ్య, బాలకృష్ణ, కరీం, బోగా రాజలింగు, వై.రామ్మూర్తి, వెంకటేశ్వర్లు, శివరావు, శ్రీకాంత్, కుమార్స్వామి, నరేశ్, లాలయ్య, మంగీలాల్, ఉప్పయ్య తదితరులున్నారు.