రుద్రంపూర్, ఏప్రిల్ 30 : కారు ఢీకొనడంతో సింగరేణి ఉద్యోగి మృతి చెందిన దుర్ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కొత్తగూడెం టూ టౌన్ ఇన్స్పెక్టర్ డి.ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం.. చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలో నివసించే రూపేష్ పాసి (36) సత్తుపల్లి కిష్టారం ఓపెన్ కాస్ట్లో జనరల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి సుమారు 11:15 గంటల సమయంలో రుద్రంపూర్ నుండి కొత్తగూడెంకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని జాతీయ రహదారిపై చండ్రుగొండ నుండి కొత్తగూడెం వైపు వెళ్తున్న TG 28 9512 నంబర్ గల కారు అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రూపేష్ పాసి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.