రామవరం: సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధన కోసం యంత్రాల పనిగంటలు పెంచి లక్ష్యాన్ని సాధించాలని సింగరేణి డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణరావు అన్నారు. గురువారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని పీవీకే 5 భూగర్భ గనిని, జీకేవోసీని సందర్శించారు. జీఎం సీహెచ్ నరసింహారావు, పీవీకే 5 గని ఏజెంట్, మేనేజర్లతో పాటు సంబంధిత అధికారులతో కలిసి గనిలో నిర్మాణంలో ఉన్న ఓపెన్ ఎక్షవేషన్ టన్నెల్ పనుల గురించి, మ్యాన్ రైడింగ్ ఏర్పాట్ల గురించి, బెల్టు పనితీరును గురించి సుధీర్ఘంగా చర్చించారు.
అనంతరం జీకేవోసీ ఉపరితల గని వ్యూ పాయింట్ నుంచి జీకేవోసీని పరిశీలించి బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీత, యంత్రాల పనితీరు, ప్రతిపాదిత వీకేవోసీ ప్రాజెక్టు గురించి సమీక్షించారు. జీకేవోసీలో రూ.2.50 కోట్లతో నిర్మించనున్న ఎకో పార్కును ఆయన సందర్శించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో యూజీమైన్స్ జీఎం సూర్యకుమార్, ఏరియా ఇంజనీర్ రఘురామిరెడ్డి, ఇంచార్జి ఎస్వోటు జీఎం రమేష్, ఏజెంట్ రవీందర్, గని మేనేజర్ పాలడుగు శ్రీనివాస్, గ్రూప్ ఇంజనీర్ ఉపేందర్, జీకేవోసీ ఎస్వో మురళి, ఎస్ఈ శ్రీకాంత్, ఎస్ఎస్వో రమణారెడ్డి, జీకేవోసీ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ మధుకర్, ఎస్ఈ శ్రీధర్, జీకేవోసీ సీనియర్ పీవో శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.