చండ్రుగొండ:మండల పరిధిలోని రావికంపాడు, గానుగపాడు గ్రామాల్లో మిర్చి తోటలను హైదరాబాద్ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు బృందం శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇటీవల మిరపతోటలకు వచ్చిన తామర పురుగు, నల్లి తదితర సమస్యలను రైతులు శాస్త్రవేత్తలకు తెలియజేశారు. ఈ సందర్బంగా శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పురుగుమందులు మోతాదుకు మించి తోటల్లో పిచికారి చేయటం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు.
15రోజులకు ఓ సారి వేపనూనె పిచికారి చేసి, నీలి, పసుపుపచ్చ అట్టలను తోటలో పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సిద్దిఖీ, స్వేత, విద్యశ్రీ, కేవికే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మినారాయణమ్మ, ఉద్యానవన శాస్త్రవేత్త శివ, ఏఓ నవీన్బాబు, ఏఈఓలు సాయిభాను , శ్రీకన్య, రైతులు పాల్గొన్నారు.