భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో హోమం నిర్వహించి, పూర్ణాహుతి జరిపారు. గతేడాది భక్తులు సమర్పించిన సూర్య ప్రభ వాహనానికి రామయ్య జన్మదినం సందర్భంగా అర్చకులు సంప్రోక్షణ చేశారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ, ఏఈఓ శ్రావణ్కుమార్, అనీల్కుమార్, సూపరింటెండెంట్ కత్తి శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, కోటి విష్ణువర్థనాచార్యులు, పొడిచేటి సీతారామ్, పొడిచేటి రామభద్రాచార్యులు, వనం స్నేహితాచార్యులు తదితరులు పాల్గొన్నారు.