చండ్రుగొండ: దేశానికి రైతే వెన్నెముక అని రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం రైతుబంధు సంబురాల్లో భాగంగా రైతువేదికల అలంకరణ కార్యక్రమాలు, మహిళల ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…రైతుబంధు పథకంతో రైతులకు పెట్టుబడిభారం తగ్గిందని, ఆర్థికంగా నిలదొక్కుకున్నారన్నారు. అప్పులు తొలగి క్రమంగా సొంతగా పెట్టుబడి పెట్టుకునేలా వ్యవసాయంలో మార్పులు వస్తున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో ఎఓ నవీన్బాబు, టిఆర్ఎస్ మండల అద్యక్షులు దారా బాబు, ప్రదాన కార్యదర్సి ఉప్పతల ఏడుకొండలు, సీనియర్ నాయకులు మాలోత్ బోజ్యనాయక్; సారేపల్లి శేఖర్, మేడా మోహన్రావు, మండల కోఆర్డినేటర్ గాదె లింగయ్య, సూర వెంకటేశ్వరరావు, ఉన్నం నాగరాజు, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.