టేకులపల్లి జనవరి 13 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బోడు పరిసర ప్రాంతాల్లో అనారోగ్యంతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 50 కేజీల చొప్పున బియ్యం మంగళవారం అందజేశారు.
బోడుకు చెందిన మురికి లాలయ్య, కుంపటి సరోజనమ్మ అలాగే బోడు కొత్తగూడెంకు చెందిన కొండ్రు అశోక్ అనారోగ్యంతో ఇటీవలే మృతి చెందారు. వీరి కుటుంబాలకు బీఆర్ఎస్ బోడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అందజేశారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలపారు.