దుమ్ముగూడెం : గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలని ఐసీడీఎస్ సీడీపీవో నవ్యశ్రీ అన్నారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని నర్సాపురం రైతువేదికలో పోషక సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు రక్తహీనత రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.
అనంతరం గర్భిణులకు సీమంతాలు, పిల్లలకు అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివరామకృష్ణ, సీతారాంపురం సర్పంచ్ కృష్ణవేణి, రామారావుపేట సర్పంచ్ పార్వతి, నర్సాపురం కార్యదర్శి నవీన్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు మాణిక్యమ్మ, కవిత, సావిత్రి, పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ కల్పన, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, గ్రామస్థులు పాల్గొన్నారు.