చుంచుపల్లి: మండలంలోని పెనగడప పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంపీడీవో సకినాల రమేష్ పరిశీలించారు. వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరుపై , ప్రజలకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కళావతి, ఎంపీవో గుంటి సత్యనారాయణ, సెక్రటరీ హనుమంతు, వీఆర్వో ప్రభాకర్రావు, పంచాయతీ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశాలు పాల్గొన్నారు.