కొత్తగూడెం: వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకొని హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును శుక్రవారం రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఆరోగ్య స్థితిపై వైద్యులతో మాట్లాడారు. అధైర్య పడొద్దని, నియోజకవర్గ అభివృద్ధికి మీరు చేస్తున్న కృషి మరువలేనిదని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే తనయుడు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావుతో మాట్లాడారు.