దమ్మపేట: ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు శుక్రవారం పోలింగ్ జరగడంతో దమ్మపేట నుంచి అన్ని పంచాయతీలకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొత్తగూడెం పోలింగ్ కేంద్రానికి తరలివెళ్లారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతున్న క్రమంలో వీరంతా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో కొత్తగూడెం పోలింగ్ కేంద్రానికి తరలివెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి తాతా మధుసూదన్దే విజయమని ఓటు వేసిన ప్రజాప్రతినిధులంతా ధీమా వ్యక్తం చేశారు.