చుంచుపల్లి : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మీ పథకం ఓ వరంలా మారిందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాలకు చెందిన సుమారు రూ.39 లక్షల చెక్కులను లబ్దిదారులకు తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కల్యాణలక్ష్మీ పథకం పేదింటి ఆడబిడ్డలకు వరంలా మారిందని, కూతురు పెండ్లి చేయడం కష్టంగా మారిన పేదలకు ఈ పథకం ద్వారా ఎంతో భరోసా కలుగుతోందన్నారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, ఎంపీపీలు బాదావత్ శాంతి, భూక్యా సోనా, తహసీల్దార్ వనం రామకృష్ణ, నాగరాజు, ఎంపీటీసీలు కొల్లు పద్మ, స్వాతి, కూసన వీరభద్రం, ఆర్తి మక్కడ్, కో ఆప్షన్ మెంబర్ ఆరీఫ్ఖాన్, సర్పంచ్లు రతన్ నాయక్, తాటి పద్మ, సంధ్య, లక్ష్మీ, జగదాంబ, ఉప సర్పంచ్ సంతోష్, డైరెక్టర్ శేషాద్రి వినోద్, టీఆర్ఎస్ నాయకులు అచ్చా నాగరాజు, గోనె గోపి, కనుకుంట్ల రవి, రాజేష్, పోకల నగేష్ తదితరులు పాల్గొన్నారు.