మణుగూరు : 2022 నూతన సంవత్సరం నియోజకవర్గ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, ఆకాంక్షిస్తూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ…2022లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో పినపాక మరింత అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.
అన్ని మండలాల్లోని ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.