అశ్వారావుపేట: అన్ని రంగగాల్లో పల్లెలు పట్టణాలతో పాటు సమానంగా అభివృద్ది సాధిస్తేనే తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగామారి దేశానికే తలమానికంగా మారుతుందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు పిలుపునిచ్చారు. బుధవారం మేజర్పంచాయతీలో ఇటీవల సుమారు రూ.70 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ సర్పంచ్లతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు గ్రామాలలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ది సాధించేలా తమవంతు కృషిచేయాలన్నారు.
అందుకు ముఖ్యమంత్రి దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రజల ముందుకు తీసుకువచ్చారన్నారు. ప్రధానంగా రైతుబంధు పథకం దేశానికే ఖ్యాతి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ జూపల్లి రమేష్లు పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు కృషి చేయాలని డిగ్రీ కళాశాలతో పాటు ఆర్టిఏ కార్యాలయం ఏర్పాటుకై ప్రత్యేక శ్రద్ద చూపాలని కోరారు.
అనంతరం ఇటీవల మృతి చెందిన అంగన్వాడి టీచర్ కాగిత రంగమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వెంట మేజర్పంచాయతీ సర్పంచ్ అట్టం రమ్య, ఉపసర్పంచ్ రేమళ్ళ కేధర్నాధ్, శెట్టిపల్లి రఘురామ్, సత్యవరపు సంపూర్ణ, యూఎస్ ప్రకాష్, తదితరులు ఉన్నారు