ఇల్లెందు, జనవరి 10 : ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డుకు చెందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్లర్క్ ఇమామ్ శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడు. తన చిన్ననాటి స్నేహితుడు ఇమామ్ మృతదేహాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం సందర్శించి పూలమాల వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఎమ్మెల్యే కన్నీటి పర్యంతం అయ్యారు. మిత్రుడి పాడెను మోసి కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన వెంట ఇల్లెందు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జానిపాషా, మాజీ టౌన్ ప్రెసిడెంట్ ఎస్.కె జానీ, ఉలింగ సతీష్, జీ.వి.భద్రం తదితరులు ఉన్నారు.