టేకులపల్లి, ఫిబ్రవరి 25 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ గ్రామ పంచాయతీలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సర్పంచ్ గుగులోత్ లక్ష్మణానాయక్, ఉప సర్పంచ్ ఉండేటి చెన్నయ్య బుధవారం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, నాణ్యమైన భోజనం పెట్టాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులను ఈ సందర్భంగా వారు ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు.

సులానగర్ జడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్న భోజనం పరిశీలన