పాల్వంచ, ఏప్రిల్ 01 : విద్యార్థులకు నిత్యం మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి నాగమణి నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం పాల్వంచ పట్టణంలోని వికలాంగుల కాలనీలో గల ప్రాథమికోన్నత పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదేవిధంగా విద్యార్థులకు నిత్యం మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలన్నారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థుల పఠన సామర్ధ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలన్నారు. పాఠశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. పాఠశాలకు కావాల్సిన సదుపాయాలు, ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రామకృష్ణ పాల్గొన్నారు.

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని : డీఈఓ నాగమణి