ఆళ్లపల్లి, ఆగస్టు 01 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల పరిధి అనంతోగు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న చెక్ డ్యాం వద్ద శుక్రవారం చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ సోమేశ్వర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల మండలం, మామకన్ను గ్రామానికి చెందిన కల్తీ ప్రవీణ్ ప్రకాశ్ చేపల వేటకు వెళ్లాడు. చెక్ డ్యాంలో ఉన్న నీళ్లలో వలవేసి, వల తీయడానికి నీళ్లలో దూకాడు. ఆ చేపల వలె తనకు యమపాశమై చుట్టుకుని మృతి చెందాడు. ప్రకాశ్కు భార్య, కుమారుడు ఉన్నారు.