అశ్వారావుపేట: వ్యాపారులు తమ రంగంలో రాణిస్తుండటంతో పాటు ఇతర రంగాలలో కూడా రాణిస్తూ తమ ప్రాంత అభివృద్దికి తోడ్పడాలని శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరావు సూచించారు. గురువారం పట్టణ వర్తక సంఘం భవననిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో ఆయన ముఖ్యతిధిగా హాజరైమాట్లాడారు. ముందుగా 15 లక్షలు వ్యయంతో నిర్మించే భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ స్వచ్చంద సేవతోపాటు, రాజకీయాలలో రాణిస్తూ మన పట్టణ అభివృద్దికి తోడ్పాటుఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి పుల్లారావు, శీమకుర్తి వెంకటేశ్వరాతో పాటె వర్తక సంఘం అధ్యక్షులు సమయమంతుల శ్రీను, కార్యదర్శి రాజేష్, పవన్, శీమకుర్తి పండు, తదితరులు పాల్గొన్నారు.