చండ్రుగొండ:కేంద్రంలోని బీజేపి ప్రభుత్వ విధానాలతో రైతుల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం తుంగారం పంచాయతీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…కొనుగోలు కేంద్రాల్లో దళారులకు స్థానం లేదని నేరుగా రైతులు వచ్చి అమ్ముకోవచ్చన్నారు. యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు.
రైతులు బీజేపి విధానాలపై పోరాటాలు జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు మాళోత్ బోజ్యనాయక్, గానుగపాడు సహకార సంఘం అధ్యక్షులు చెవుల చందర్రావు, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ గాదె లింగయ్య, సొసైటి డైరక్టర్ పసుపులేటి వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ నాయకులు బానోత్ రాముడు,తదితరులు ఉన్నారు.