మణుగూరు : ఏరియాలోని కేసీహెచ్పీలో విధులు నిర్వహిస్తున్న పూర్ణచందర్రావు(56) గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన మణుగూరులో ఏరియాలో చోటు చేసుకున్నది. ఆదివారం రెండో షిఫ్ట్లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో అస్వస్థతకు గురైన పూర్ణచందర్ రావును స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.
అక్కడకు వెళ్లిన తర్వాత పరిస్థితి విషమించడంతో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పూర్ణచందర్రావు మృతి పట్ల టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వీ.ప్రభాకర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు.