భద్రాచలం: ఐటీడీఏ భద్రాచలం ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని నిరుద్యోగ గిరిజన యువత కోసం అక్టోబర్ 7న జాబ్ మేళా నిర్వహించనున్నారు. నవత ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈజాబ్మేళా నిర్వహిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్మేళాలో క్లర్క్, ఆఫీస్ ఆపరేషన్స్ అండ్ మార్కెటింగ్, అసిస్టెంట్ మేనేజర్ ఐ.టీ (బి.టెక్/డిప్లోమా, మెకానికల్) ట్రైనీ హర్డ్వేర్, హెవీ వెహికల్ డ్రైవర్స్, హెవీ వెహికల్ హెల్పర్స్, మెకానిక్స్ (ఐటీఐ డీజిల్ మెకానిక్/ ఆటో మొబైల్)లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు.
అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో ఫార్మసిస్ట్, అసిస్టెంట్ ఫార్మాసిస్ట్, ట్రైనీలకు ఉద్యోగవకాశాలు ఉన్నాయని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు 10వ తరగతి ఆపైన ఐటీఐ (డీజిల్ మెకానిక్, డిప్లోమా/ బీ ఫార్మసీ/ డీ ఫార్మసీ) ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. అర్హులైన వారు ఆధార్కార్డు, పాస్పోర్ట్ సైజు ఫోటో, స్టడీ పత్రాలతో ఐటీడీఏ భద్రాచలం ప్రాంగణంలోని వైటీసీ భవనంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని తెలిపారు. పూర్తి సమాచారం కోసం 8143840906 నెంబర్లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.