చండ్రుగొండ: పోకలగూడెం పంచాయతీ పరిధిలోని మిరపతోటలను సోమవారం వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ అధికారులు పరిశీలించారు. రైతులు, స్థానిక విత్తనాల డీలర్ వద్ద నీయో సీడ్స్ వారి నీలాద్రి రకం మిరప విత్తనాలు నాటిన తోటలల్లో తెగుళ్లు అధికంగా వస్తున్నాయని, నాసీరకం విత్తనాలు అంటగట్టారనే ఆరోపణలపై అధికారులు ఆరా తీశారు. సుమారు 5కేజీల విత్తనాలు నాటిన మిరప పంటలను పరిశీలించారు. మిరప తోటలో ఆకుముడలు అధికంగా ఉన్నట్లు తేల్చారు.
దీనికి సంబంధించి నివేదికను ఉన్నతాధికారులకు పంపటం జరుగుతుందని ఏఓ నవీన్వాబు, హెచ్ఓ సందీప్లు తెలిపారు. ఈసందర్భంగా ఏఈఓ సాయిబాను, రైతులు గుగులోత్ హనుమ, నాగేష్, చిన్న, నాగే, రవి, అమర్సింగ్, శ్రీనివాస, శోభన్బాబు, లతీప్, శంకర్ తదితరులు ఉన్నారు.