జూలూరుపాడు, మే 25 : జూలూరుపాడు మండలంలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. మండలంలోని వెంగన్నపాలెం, వినోబానగర్, గుండెపూడి గ్రామాల్లో సుమారు అరగంట పాటు కురిసిన వర్షానికి వాతావరణం పూర్తిగా చల్లబడింది. భానుడి భగభగలతో, తీవ్ర ఉక్కపోతతో సతమతమవుతున్న మండల ప్రజలకు ఈ వర్షం ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. కాగా గాలుల తీవ్రతకు జూలూరుపాడు – వినోబానగర్ మధ్య ప్రధాన రహదారిపై ఓ పెద్ద చెట్టు కూలిపడింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో అధికారులు, స్థానికులు వెంటనే స్పందించి చెట్టు కొమ్మలను తొలగించి రాకపోకలకు అనుకూలంగా మలిచారు.

జూలూరుపాడులో ఈదురుగాలుల బీభత్సం