బూర్గంపహాడ్, మే 02 : సమతుల్యమైన ఆహారం తీసుకున్నప్పుడే బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారని బూర్గంపహాడ్ మండలంలోని కృష్ణసాగర్ సర్పంచ్ తాటి వాణి, ఉప సర్పంచ్ మోహన్రావు అన్నారు. శనివారం మండల పరిధిలోని కృష్ణసాగర్ పంచాయతీ ఎస్టీ కాలనీ, బత్తులనగర్లో రెండు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి అక్కడ చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు టీహెన్ఆర్ కార్యక్రమంలో భాగంగా తినుబండారాలు, పాలు, కోడిగుడ్లు, బాలామృతం ప్యాకెట్లు, బియ్యం, నూనె తదితర వాటిని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకుని ఆరోగ్యాన్ని పదిలం చేసుకోవాలన్నారు. కిశోర బాలికలు, మూడేళ్ల చిన్నారులు బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే రక్తహీనత లేకుండా ఉంటుందన్నారు. అనంతరం పశువుల షెడ్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు బొర్రా జ్యోతి, గుండమళ్ల పుల్లమ్మ, పాలకవర్గ సభ్యులు కుర్సం రేవతి, కుంజా రజిత, బాదావత్ సురేష్, గుండి వెంకటేశ్వర్లు, ఆశావర్కర్లు, బాలింతలు, గర్భిణులు, చిన్నారులు పాల్గొన్నారు.