భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. దీంతో ఇక్కడి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఇక్కడ నీటిమట్టం 53 అడుగులకు చేరింది. ఈ రాత్రికి ఇక్కడి నీటిమట్టం 55 అడుగులకు చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ ప్రాంతంలో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే 100 నెంబర్కు కాల్ చేయాలని చెప్పారు.