దుమ్ముగూడెం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. బుధవారం దుమ్ముగూడెం హెడ్ లాకుల వద్ద గోదావరి నీటిప్రవాహం 17.5 అడుగులకు చేరింది. మంగళవారం సాయంత్రం చర్ల తాలిపేరు వద్ద గేట్లు ఎత్తివేయడంతో దిగువకు వరదనీరు భారీగా చేరుతుండటంతో గోదావరి నీటిప్రవాహం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. సాయంత్రానికి 22 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.