రామవరం, జులై 10 : సింగరేణి యాజమాన్యం కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో మహిళలకు తేనె టీగల పెంపకంపై శిక్షణ అందజేయనున్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలెం రాజు గురువారం పత్రిక ప్రకటనలో తెలిపారు. మనబ్ కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ, అగర్తల, వెస్ట్ త్రిపుర వారిచే ఉచిత శిక్షణతో పాటుగా సంబంధిత పరికారాలను ఇచ్చి స్వయం ఉపాధి కల్పించేలా ప్రోత్సహించనున్నట్లు వెల్లడించారు. జీకేఓసి, వీకేఓసి ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాలు (lకొత్తగూడెం (6,7,8,9 వార్డ్ లకు చెందిన నిర్వాసితులకు), (పెనగడప, రామవరం, రుద్రంపూర్, ధన్బాద్, గరీబ్ పేట్, పెనుబల్లి (చుంచుపల్లి మండలం), రాంపూర్, తిప్పనపల్లి, అంబేద్కర్ నగర్, సీతంపేట్, 3 ఇంక్లైన్, 4 ఇంక్లైన్, వనమా నగర్ & ప్రశాంతి నగర్) మహిళలు శిక్షణకు అర్హులన్నారు. కావున ఆసక్తి కలిగిన పై గ్రామాల్లోని మహిళాలు దరఖాస్తులను కొత్తగూడెం ఏరియా పర్సనల్ డిపార్ట్మెంట్ నందు ఈ నెల 16 లోపు అందజేయాలని పేర్కొన్నారు.