భద్రాచలం: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పటిష్టతకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెరాస రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. బుధవారం భద్రాచలం పట్టణంలో 1, 2వార్డుల్లో పార్టీ నాయకులతో కలసి వార్డు కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు పార్టీని మరింత బలపర్చేందుకు కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ఎన్నికైన వారు ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని అన్నారు.
ముందుగా 1వార్డు కమిటీని నియమించారు. అధ్యక్షులుగా మామిళ్ల రాంబాబు, కార్యదర్శిగా జిల్లా కృష్ణవేణిని ఎన్నుకున్నారు. 2వ వార్డు అధ్యక్షులుగా ఎస్ శేషా చార్యులు, ఉపాధ్యక్షులుగా బీ రామాచార్యులు, కార్యదర్శిగా కే రఘురామ్లను, ఇతర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా రామావఝల రవికుమార్, మాజీ నియోజకవర్గ ఇంఛార్జ్ మానె రామకృష్ణ, యశోద నగేష్, అరికెళ్ల తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి వ్యవహరించారు.