పాల్వంచ: భారతీయ ఇంజనీరింగ్ రంగానికి పితామహుడుమోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు పాల్వంచలో బుదవారం ఘనంగా నిర్వహించారు. కేటీపీఎస్కు చెందిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేటీపీఎస్ “ఏ” కాలనీలోని సంఘం కార్యాలయంలో విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర నాయకులు చాట్ల శ్రీనివాసరావు,కృష్ణయ్య,నారాయణ,రామకృష్ణ జాదవ్, సమీర్, రవి, విజయ్, హరీష్, ప్రజోష్న, వంశీ తదితరులు పాల్గొన్నారు.