బూర్గంపహాడ్, మే 21 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక పంచాయతీలో ట్రాన్స్కో డీఈ జీవన్ కుమార్ ఆదేశాల మేరకు ఏడీఈ నరసింహారావు పర్యవేక్షణలో ఏఈ ఉపేందర్ ఆధ్వర్యంలో గురువారం విద్యుత్ శాఖ సిబ్బంది ట్రాన్స్ ఫార్మర్ల వద్ద హెచుతగ్గులు. లోడ్ బ్యాలెన్స్ పై చర్యలు చేపట్టారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో పాటు వినియోగదారులు ఏసీ, కూలర్లు ఎక్కువ సామర్థ్యం మేరకు వాడుతుండడంతో ట్రాన్స్ ఫార్మర్ల వద్ద హై వోల్టేజ్ కారణంగా ఫీజులు ఎగిరిపోతున్నాయని. ఈ క్రమంలో వాటిని సరిచేసేందుకు హెచ్చుతగ్గులు చేస్తూ, లోడ్ బ్యాలెన్స్ చేస్తూ సిబ్బంది, రాత్రనకా పగలనక పని చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫీజులు పోవడం జరుగుతుందని, ఈ సమస్యను అధిగమించేందుకు ప్రతిరోజూ ఉదయం గంట, సాయంత్రం గంటసేపు విద్యుత్ సరఫరాకు స్వల్ప అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏడీ నర్సింహారావుతో పాటు ఏఈ ఉపేందర్ చెబుతున్నారు. దీనికి వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎల్ఎం ఎం.సత్యనారాయణ, లైన్మెన్లు పాల్గొన్నారు.