భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి దొరికినట్లు ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. ఈ గంజాయి మధ్యప్రదేశ్ నుండి రవాణా అవుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సునీల్ దత్ విలేఖరుల సమావేశంలో బుధవారం నాడు ఈ వివరాలు వెల్లడించారు.
మధ్యప్రదేశ్ నుండి తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోటకు ఈ గంజాయి రవాణా అవుతున్నట్లె తెలిపారు. టైల్స్ లోడ్ కింద గంజాయి ఉంచి స్మగ్లింగ్ చేస్తున్నట్లు చెప్పారు. సునీల్, దినేష్ అనే ఇద్దరు వ్యక్తులు.. 365 కేజీల గంజాయిని తరలిస్తుండగా కొత్తగూడెం చుంచుపల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.