మణుగూరు: శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డన్సెర్చ్ నిర్వహిస్తున్నామని ఏఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా ఎస్పీ సునీల్దత్ ఆదేశాల మేరకు శుక్రవారం మణుగూరు మండలంలోని వెంకటపతినగర్, మద్దులగూడెం గ్రామాల్లో సీఐ భానుప్రకాశ్, ఎస్ఐలు కార్డన్సెర్చ్ నిర్వహించారు. తొలుత ఇండ్లల్లో సోదాలు నిర్వహించి అనంతరం గ్రామస్తులతో సమావేశం నిర్వహించి ఏఎస్పీ మాట్లాడుతూ…నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు భద్రత, అపరిచిత వ్యక్తుల పట్ల తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.
నిషేధిత మత్తుపదార్ధాలు, గుట్కాల విక్రయాలు వంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. వాహనాలు నడిపేటప్పుడు విధిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్సులతో పాటు వాహనపత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్రెండ్లీ పోలీసింగ్కు సహకారం అందించాలని, ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్ఐలు పీఎన్ రావు, భార్గవ్ తదితరులు ఉన్నారు.