Maloth Sindhu | భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 15 : 38వ జాతీయ క్రీడా పోటీల్లో భాగంగా ఫిబ్రవరి 9న ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్లో జరిగిన 4 x 100 రిలే అథ్లెటిక్ విభాగంలో జిల్లాకు చెందిన మాలోత్ సింధు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇవాళ ఐడిఓసి కార్యాలయం కలెక్టర్ ఛాంబర్లో మాలోత్ సింధును ఘనంగా సన్మానించారు.
జాతీయస్థాయిలో జిల్లా క్రీడలకు గుర్తింపు తెచ్చిన సింధుకు ప్రత్యేక అభినందనలు తెలియజేసి.. రూ. 25000/- చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారుల్లో ఇమిడి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి వెలికితీయాలని అన్నారు. జాతీయ స్థాయి క్రీడల్లో రాణించడానికి ప్రోత్సహించిన మాలోత్ సింధు కోచ్ నరేష్, తండ్రి మాలోత్ లక్ష్మణ్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారి ఎం పరంధామ రెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ మహీధర్, జాయింట్ సెక్రటరీ మల్లికార్జున్, డిస్టిక్ ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ యుగంధర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Government Hospital | రికార్డ్ బ్రేక్.. 5 రోజుల్లో 200 సర్జరీలు