కరీమాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు జన్మదిన ఈ నెల 17న నిర్వహించనున్న వృక్షార్చన (Vruksharchana) పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆవిష్కరించారు. రాష్ట్రం, దేశంతో పాటు సమస్త భూగోలాన్ని నివాసా యోగ్యంగా మార్చాలానే సంకల్పంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరుతో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న ఈ మహోత్తర కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉరుసులోని శ్రీ నాగేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతంల్లో మొక్కలను నాటారు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న వృక్షార్చన నిర్వహించనున్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపిన విషయం తెలిసిందే. వచ్చే సోమవారం ప్రతి ఒకరూ మూడు మొకలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒకరూ మొకలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవటమే కేసీఆర్కు మనం ఇచ్చే పుట్టినరోజు కానుక అని చెప్పారు. హరిత తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ సంకల్పానికి మద్దతుగా చంద్రునికో నూలు పోగులా గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ సంతోష్కుమార్ వృక్షార్చన కార్యక్రమాన్ని తలపెట్టినట్టు పేర్కొన్నారు.