చండ్రుగొండ: రైతుల సంక్షేమం కోసం నిరంతరం ప్రభుత్వం పనిచేస్తుందని, సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలను అందజేయటం జరుగుతుందని గానుగపాడు సహకార సంఘం అధ్యక్షుడు చెవుల చందర్రావు అన్నారు. శుక్రవారం గానుగపాడు సహకార సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాలకమండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ…సహాకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పండించిన పంటను కొనుగోలు చేసి, రైతుల అకౌంట్లలో నగదు జమ చేయటం జరుగుందన్నారు. త్వరలో ఖరీఫ్ పంట కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో సొసైటీ సీఈఓ లంకా నరసింహరావు, సొసైటి వైస్ చైర్మన్ భూపతి ధనలక్ష్మి, డైరక్టర్లు రామిశెట్టి సరళ, పసుపులేటి వెంకటేశ్వర్లు, మార్తమ్మ, తదితరులు పాల్గొన్నారు.