రుద్రంపూర్, మార్చి 21 : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఈద్గాకు చేరుకుని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రార్థనలు చేశారు. ప్రార్థనల అనంతరం రుద్రంపూర్ సర్పంచ్ బానోతు కేస్లీ ఆధ్వర్యంలో ముస్లింలకు మజ్జిగ ప్యాకెట్లు, మంచినీటిని పంపిణీ చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గౌతమ్పూర్ వార్డు మెంబర్ బోనగిరి నాగమణి, బోనగిరి శ్రీకాంత్ దంపతులు ప్రతి ఒక్కరికి పుచ్చకాయలను అందజేసి ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు గౌరిశెట్టి రవి, నిమ్మల రాజు, నిమ్మల సాగర్, గాదం శ్యామ్, సౌల శ్రీనివాస్ పాల్గొన్నారు.

ముస్లింలకు మజ్జిగ, మంచినీరు, పుచ్చకాయలు పంపిణీ