కొత్తగూడెం : తెలంగాణ పల్లె సంస్కృతికి బతుకమ్మ ప్రతిరూపంగా నిలుస్తుందని, ఆడపడుచులు అపురూపంగా జరుపుకునే పూల పండుగ ఇదేనని సింగరేణి జీఎం సూర్యనారాయణ అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ పుట్టినింటికి వచ్చి ఆడపడుచులు తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ఆనందోత్సాహాలతో బతుకమ్మ పండుగ ను జరుపుకుంటారన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు.
మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంవోఏఐ ప్రధాన కార్యదర్శి ఎన్వీ రాజశేఖర్రావు, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఆల్వీన్, అడ్మినిస్ట్రేటీవ్ మేనేజర్ భాస్కర్, లా మేనేజర్ శిరీషరెడ్డిలు పాల్గొన్నారు.