చండ్రుగొండ: జాతీయ బ్యాంకు ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు 16, 17 తేదీల్లో సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో గురువారం మండలంలో బ్యాంకులు మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన బ్యాంకుల ప్రవేటీకరణ, విలీనం వంటి ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి ఉద్యోగ సంఘాలు.
జాతీయ బ్యాంకులను ప్రవేటీకరించటం సరికాదని, ఎట్టి పరిస్థితుల్లో ప్రవేటీకరణను వ్యతిరేకిస్తామని ఆయా సంఘాల నాయకులు పేర్కొన్నాయి. మండలంలోని ఎస్బిఐ బ్యాంకు మూతపడటంతో ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు.