దుమ్ముగూడెం : మండల పరిధిలోని అచ్యుతాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో 27 మంది విద్యార్థులకు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏజే ప్రభాకర్ తన తండ్రి జాన్ జ్ఞాపకార్ధం బుధవారం స్కూల్ బ్యాగులు, నోటుపుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, వాటర్బాటిళ్లు, ప్లేట్లు, మాస్క్లు వితరణగా అందజేశారు. విద్యార్థుల సౌకర్యార్ధం ఉపాధ్యాయుడు ఏజే ప్రభాకర్ వీటిని అందించడం అభినందనీయమని పాఠశాల హెచ్ఎం, తోటి ఉపాధ్యాయులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణవేణి, ఉపసర్పంచ్ బుటారి నాగమణి, పంచాయతీ కార్యదర్శి ఎస్.పద్మ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు డి.నాగమణి, ఎ.శంకర్, మాధవీలత తదితరులు పాల్గొన్నారు.