కొత్తగూడెం: భద్రతా నియమాలు పాటిస్తూ డ్రైవర్లు రోడ్డుప్రమాదాలు జరగకుండా చూడాలని కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ జవ్వాది వెంకటేశ్వరబాబు అన్నారు. మంగళవారం కొత్తగూడెం బస్టాండ్లో 33 మంది కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, ఐఆర్ బస్సుల డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. డిపో లాభనష్టాలపై, బస్సు ప్రయాణీకులతో ఎలా మెలగాలి..? వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలనే విషయాలను గురించి ఆయన సిబ్బందికి వివరించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ యాదమణి, సీఆర్సీ శామ్యూల్, ఎస్డీఐ చందర్రావులు పాల్గొన్నారు.