అశ్వాపురం: నూతన వ్యవసాయ విధానాలను రైతులు అలవరుచుకోవాలని అందుకోసం ప్రత్యామ్నాయ పంటల సాగు లాభదాయమని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా ఉద్యానవనశాఖ అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం మండలం నుంచి సుమారు 70 మంది రైతులను అశ్వరావుపేట, దమ్మపేట మండలాలకు బస్లో తీసువెళ్లారు. ఉద్యానవనశాఖ అధికారులు రైతులకు ఆయిల్సాగుపై అవగాహన కల్పించారు. ఆయిల్ ఫామ్ సాగుకు ఎకరాకు మొక్కలు,ఎరువులపై రూ. 60వేల రాయితీని నాలుగు విడతలుగా నాలుగు సంవత్సరాలవరకు అందిస్తుందన్నారు.
ఆయిల్పామ్ పంటలు సాగుచేయడం వల్ల నాలుగు సంవత్సరాల నుంచి నికరంగా ఖర్చులు పోనురూ.1లక్ష ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన అధికారి ఆర్ శాంతి ప్రియ, వ్యవసాయ విస్తరణ అధికారి నాగేశ్వరరావు, ఆయిల్ఫెడ్ అధికారి పణికుమార్,యుగేందర్, మహేష్, ఈశ్వర్, రైతులు తదితరులు పాల్గొన్నారు,